ఏం చేద్దాం : కశ్మీర్ గవర్నర్, రాయబారులతో రాజ్ నాథ్ చర్చ

ఏం చేద్దాం : కశ్మీర్ గవర్నర్, రాయబారులతో రాజ్ నాథ్ చర్చ

ఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు… జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, పాకిస్థాన్ లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా కూడా హాజరయ్యారు. మరోవైపు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తోనూ సమావేశమయ్యారు అజయ్ బిసారియా. అమెరికాలో భారత రాయబారి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా కూడా రాజ్ నాథ్ ను కలిశారు.