బలమైన దేశాల్లో నేడు భారత్ ఒకటి

బలమైన దేశాల్లో నేడు భారత్ ఒకటి

1971లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న ప్రతి భారతీయుడు చరిత్ర సృష్టించారన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. లక్నో లో జరుగుతున్న అఖిలభారత పూర్వ సైనిక్  సేవా పరిషత్ రజతోత్సవంలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. బలమైన దేశాల్లో నేడుభారత్ ఒకటిగా నిలిచిందన్నారు. ప్రపంచ దేశాల ముందు భారత ప్రతిష్ట పెరిగిందని చెప్పారు రాజ్నాథ్ సింగ్, ఉగ్రవాదంపై పోరాడే శక్తి భారత్ కు కూడా ఉందన్నారు.. సర్జికల్ స్ట్రైక్ చేస్తే ప్రపంచ దేశాలే ఆశ్చర్యపడ్డాయన్నారు రాజ్ నాథ్ సింగ్. ఇకపై ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వబోమన్నారు.