జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదు

జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరవదు
  • హంద్వారా అమరవీరులకు రాజ్ నాథ్ నివాళి

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ లోని హంద్వారా లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు మృతి చెందటంపై ఢిపెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తీవ్ర మనస్తాపాన్ని కలిగించిందని చెప్పారు. టెర్రరిస్టులతో పోరాటం లో జవాన్లు ఎంతో ధైర్య సాహసలు కనబర్చారని…వారి ప్రాణ త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదని చెప్పారు. ఎన్ కౌంటర్ చనిపోయిన జవాన్లకు రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు