అక్కా చెల్లెళ్లతో రాఖీ కట్టించుకున్న కేసీఆర్

 అక్కా చెల్లెళ్లతో రాఖీ కట్టించుకున్న కేసీఆర్

హైదరాబాద్: రక్షా బంధన్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన సోదరీమణులచే రాఖీ కట్టించుకున్నారు. ఆదివారం రక్షా బంధన్ ను పురస్కరించుకుని సోదరీమణులు ముగ్గురు ప్రగతి భవన్ రావడంతో కేసీఆర్ ఇంట సందడి వాతావరణం ఏర్పడింది. కేసీఆర్ కు స్వయానా అక్కా చెల్లెళ్లు అయిన లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మ ముగ్గురు కలసి కేసీఆర్ కు హారతి పట్టి రాఖీలు కట్టారు. మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు.
కేటీఆర్ కు, హిమాన్షుకు రాఖీ కట్టిన అలేఖ్య
మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు హిమాన్షుకు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ప్రేమగా మిఠాయి తినిపించింది. తండ్రి అభినందనలతో ప్రేమగా తండ్రి కేటీఆర్ కు కూడా అలేఖ్య రాఖీ కట్టింది. ముసిముసి నవ్వులతో కేటీఆర్ తన కుమార్తెతో రాఖీ కట్టించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ  సోదరీమణులందరితో కలసి గ్రూప్ ఫోటోలు దిగి ఆనంద క్షణాలను పదిలం చేసుకున్నారు. కార్యక్రమంలో సీఎం సతీమణి శోభ తోపాటు కేసీఆర్ సోదరీమణులంతా పిల్లల ముచ్చట, ఆల్లరితో ఆనందంగా గడిపారు.