టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీతి సింగ్ (Rakul Preet Singh), నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 21న పెళ్లి పీటలెక్కబోతున్నారు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమంక్షంలోనే గోవాలో వీరు వెడ్డింగ్ జరగనుంది.
మూడు రోజుల పాటు జరిగే వీరి వివాహ వేడుకలో చాలానే స్పెషల్స్ ఉన్నాయట. రోజుకొక డిజైనర్ తయారుచేసిన డ్రెస్ లను వీళ్లు ఈ వివాహ వేడుకలో ధరించబోతున్నారట. ఫేమస్ డిజైనర్స్ సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా వీరి పెళ్లి దుస్తులు డిజైన్ చేశారని సమాచారం.
అయితే..రకుల్ పెళ్లిపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. 'మహిళ ఎప్పటికైనా తాను పుట్టిన ఇంటిని వీడి మరొక ఇంటికి వెళ్లాల్సిందే. ప్రపంచం ఇలాగే నడుస్తోంది. దీన్ని మనం మార్చలేం. మార్పును అంగీకరించాలి..ప్రతిఒక్కరు మనస్ఫూర్తిగా స్వాగతించాలి. మన ఆలోచనా విధానం ఎంత సానుకూలంగా ఉంటే అంత మంచిది’ అంటూ పెళ్లిపై తన అభిప్రాయాన్ని రకుల్ చెప్పుకొచ్చింది.
మొదట వీరి పెళ్లి వేదికను మిడిల్ ఈస్ట్లో చేయాలనుకున్నారు. అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ ను కూడా సెలెక్ట్ చేశారు. అయితే, కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ..డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వారు వేరే దేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే మంచి పర్యాటక ప్రదేశాలను సెలక్ట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ఇకపై వెకేషన్కు స్వదేశంలో ఉన్న ప్రాంతాలకు మాత్రమే వెళ్తామని పలువురు సెలబ్రెటీలు చెప్పారు. ఈ క్రమంలోనే రకుల్ జంట కూడా పెళ్లి వేదిక గోవాకి మార్చుకున్నట్లు సమాచారం.