త్వరలో పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్లాండ్ లో తన ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మీ హాజరయ్యారు. వీరిద్దరితో రకుల్ కు మంచి సాన్నిహిత్యం ఉంది. థాయ్లాండ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలను రకుల్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రకుల్ ప్రీత్ సింగ్ నటుడు-నిర్మాత జాకీ భగ్నానీతో ఎప్పటినుంచో డేటింగ్ లోఉంది. 2024 ఫిబ్రవరి 21న గోవాలో వీరిద్దరి వివాహం జరగనుంది. మొదట్లో ఫారిన్ లొకేషన్లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ చివరకు గోవాలో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది ఈ జంట. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరుకానున్నారు.
కాగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.. ఆ తరువాత రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ అలాఅలా ఈమెకు తెలుగులో ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ముంబయికి షిఫ్ట్ అయిపోయింది. వరసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది.