తల్లి సురేఖతో ఫోటో దిగిన రామ్ చరణ్

తల్లి సురేఖతో ఫోటో దిగిన రామ్ చరణ్

నిత్యం షూటింగ్లతో బిజీగా ఉండే నటులు..కాస్త గ్యాప్ దొరికితే చాలు కుటుంబంతో టైం స్పెండ్ చేస్తుంటారు. తాజాగా రామ్ చరణ్ కూడా కుటుంబంతో గడుపుతున్నాడు. ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్తో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ చిత్ర షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న మెగా పవర్ స్టార్..ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మేరకు తన తల్లి సురేఖతో దిగిన  ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 

ఇంత కన్నా మంచి పోస్ట్ లేదు.. 
ఉదయాన్నే తన మాతృమూర్తి సురేఖతో ఫోటో దిగిన రామ్ చరణ్..ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. “ఇంతకన్నా మంచి పోస్ట్తో నేను నా ఈరోజుని స్టార్ట్ చెయ్యకుండా ఉండలేనని”  అంటూ కామెంట్ చేశాడు.  రామ్ చరణ్ తల్లి సురేఖతో ఫోటో పోస్ట్ చేయడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  తమ అభిమాన హీరో ఇంత హ్యాపీగా ఫీల్ అవుతూ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. 

ఆర్సీ 15లో రామ్ చరణ్..
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో  సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ఆర్సీ 15  అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతోంది. ఈ మూవీ పొలిటికల్ నేపథ్యంలో ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో  కియారా అద్వానీ, శ్రీకాంత్ కీలకపాత్రలలో నటిస్తున్నారు.  ఆర్సీ 15 తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్, విశాఖపట్నంలో ప్రారంభం కానుంది.