ఒకే ఒక్కడు.. రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ సంచలన ట్వీట్

ఒకే ఒక్కడు.. రేవంత్ రెడ్డిపై ఆర్జీవీ సంచలన ట్వీట్

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పదేళ్ల బీఆర్ఎస్  పాలనకు స్వస్తీ పలుకుతూ.. కాంగ్రెస్ పార్టీకి అధికార పగ్గాలు అప్పజెప్పారు తెలంగాణ ప్రజలు. డిసెంబర్ 3 ఉదయం మొదలైన ఓట్ల లెక్కింపులో ముందు నుండే స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది కాంగ్రెస్ పార్టీ. డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని సాధించిన సందర్బంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇందులో భాగంగానే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ, రేవంత్ రెడ్డిని సీఎం అని సంబోధిస్తూ షాకింగ్ ట్వీట్ చేశారు.. హాయ్.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఎన్నో ఏళ్ళ తరువాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీపై గౌరవం పెరిగింది. కారణం.. రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారు. తెలంగాణాలో తప్పా.. ఎలక్షన్స్ జరిగిన అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గెలుపు కాంగ్రెస్ పార్టీడి కాదు. బాహుబలి లాంటి రేవంత్ తమ పార్టీలో ఉన్నందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆయనకు ధన్యవాదాలు తెలపాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. హే రేవంత్ రెడ్డి టేక్ ఏ బౌ.. అంటూ రాసుకొచ్చారు వర్మ. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.