ప్రఖ్యాత లాయర్ రామ్ జెఠ్మలానీ కన్నుమూత

ప్రఖ్యాత లాయర్ రామ్ జెఠ్మలానీ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, ప్రఖ్యాత లాయర్ రామ్ జెఠ్మలానీ కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు. రెండు వారాలుగా రామ్ జెఠ్మలానీకి ఢిల్లీలోని హాస్పిటల్ లో చికిత్స అందించారు డాక్టర్లు. ఈ ఉదయం కన్నుమూసినట్టు డాక్టర్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, ట్రయల్ కోర్టుల్లో ప్రముఖ కేసుల్లో డిఫెన్స్ లాయర్ గా వ్యవహరించి దేశంలోనే పాపులర్ లాయర్ గా పేరు తెచ్చుకున్నారు రామ్ జెఠ్మలానీ.

రామ్ జెఠ్మలానీ 1923, సెప్టెంబర్ 14న ప్రస్తుత పాకిస్థాన్ లోని సింధు ప్రావిన్స్ .. శిఖర్ పూర్ లో జన్మించారు. ఆయన పూర్తిపేరు రామ్ బూల్ చంద్ జెఠ్మలానీ. 

94 వయసులో ఇటీవలే లాయర్ గా రిటైర్మెంట్

లాయర్ గా రామ్ జెఠ్మలానీది సుదీర్ఘ కెరీర్. 94 ఏళ్ల వయసులోనూ ఆయన హై ప్రొఫైల్ కేసులను డీల్ చేస్తూనే ఉన్నారు. పెద్దపెద్ద నాయకులు లీగల్ ఇష్యూస్ ఎదురైతే.. వారందరికీ కనిపించే ఒకే ఒక్క లాయర్ రామ్ జెఠ్మలానీ. ఆయన్ని లాయర్ గా పెట్టుకుంటే… తమను కేసులనుంచి బయటపడేస్తాడన్న బలమైన నమ్మకం నాయకుల్లో ఉంటుంది. 

కేసుల్లో నేతలకు కేరాఫ్.. 

గుజరాత్ గోద్రా కేసుల్లో నరేంద్రమోడీని డిఫెండ్ చేసింది రామ్ జెఠ్మలానీనే. లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసు, అరవింద్ కేజ్రీవాల్ అవినీతి కేసు , అద్వానీ హవాలా కేసులో, వైఎస్ జగన్ అవినీతి కేసులో డిఫెన్స్ వాదనలు వినిపించింది రామ్ జెఠ్మలానీనే. ఇందిరాగాంధీ హత్య కేసులోనూ, రాజీవ్ గాంధీ హత్యకేసులోనూ నిందితుల తరఫున, పార్లమెంట్ పై దాడి చేసిన ఉగ్రవాదుల తరఫున రక్షణాత్మక వాదనలు వినిపించారు రామ్ జెఠ్మలానీ. రాజీవ్ గాంధీ హత్య కేసులో హంతకురాలి తరఫున మద్రాస్ హైకోర్టులో డిఫెన్స్ వాదనలు వినిపించారు. 

దేశంలో ఎన్నో హై ప్రొఫైల్ కేసుల్లో డిఫెన్స్ లాయర్ గా రామ్ జెఠ్మలానీ పేరు తెచ్చుకున్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా రామ్ జెఠ్మలానీ పనిచేశారు. 6వ, 7వ లోక్ సభల్లో.. ముంబై నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్ పేయిపై లక్నోలో పోటీ చేశారు. 

1959లో మహారాష్ట్రలో కేఎం నానావతీ కేసులో ప్రాసిక్యూటర్ గా వాదనలు వినిపించి పాపులర్ అయ్యారు రామ్ జెఠ్మలానీ. స్టాక్ మార్కెట్ స్కామ్స్ లో హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ ల తరఫున వాదించారు. 

అఫ్జల్ గురు మరణ శిక్ష, జెస్సికాలాల్ మర్డర్ కేసులో మనుశర్మ తరఫున డిఫెన్స్ లాయర్ గా వ్యవహరించారు రామ్ జెఠ్మలానీ. 

2010లో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రామ్ జెఠ్మలానీ.