
రామ్ పోతినేని హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ పి.మహేష్ బాబు రూపొందిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. రామ్ కెరీర్లో ఇది 22వ సినిమా. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో రామ్, ఉపేంద్ర పాల్గొంటున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే కీలక టాకీ పార్ట్ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ సినిమాలో మేజర్ హైలైట్గా ఉంటాయని మేకర్స్ చెప్పారు.
ఇందులో రామ్ ఇప్పటివరకు చేయని ఒక యూనిక్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. ఇటీవల రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్, మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.