ముస్త్యాల సర్పంచ్‌‌కు ఇంటర్నేషనల్‌‌ అవార్డు

ముస్త్యాల సర్పంచ్‌‌కు ఇంటర్నేషనల్‌‌ అవార్డు

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముస్త్యాల సర్పంచ్ రామగిరి లావణ్య శనివారం ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఉమెన్ పార్లమెంటు అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాల మహిళలు పాల్గొనగా ఇండియాలోని 10 మంది మహిళలు ఈ అవార్డు తీసుకున్నారు. సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ తనకు ఈ అవార్డు  రావడం ఆనందాన్నిచ్చిందన్నారు. 

ప్రపంచ దేశాల్లో ముస్త్యాల పేరును నిలబెట్టినందుకు గర్వంగా ఉందన్నారు. గ్రామంలో చేసిన సేవలతో పాటు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన సమరయోధుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించినందుకు ఈ అవార్డు బహుకరించారని చెప్పారు. ఈ ఆవార్డును ముస్త్యాల గ్రామ ప్రజలకు అంకితం చేస్తున్నానని ప్రకటించారు.