9వ రోజు వైభవంగా రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు

9వ రోజు వైభవంగా రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు

ముచ్చింతల్ లో రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు 9వ రోజు వైభవంగా సాగుతున్నాయి. ఈ రోజు సాయంత్ర 5 గంటలకు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గోనున్నారు. యాగశాలలో వైయూహిక ఇష్టి, నారసింహ ఇష్టి యాగాలను నిర్వహిస్తున్నారు. దివ్య దేశాల్లోని 20 ఆలయాలకు ప్రాణ ప్రతిష్ట చేసి మహాసంప్రోక్షణ నిర్వహిస్తున్నారు. అలాగే కుంభాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ప్రవచన మండపంలో రామానుజాచార్యుల పూజ, ప్రవచనాలు కొనసాగుతున్నాయి.