రామప్ప శిల్పకళ అద్భుతం : పీసీ ఘోష్

రామప్ప శిల్పకళ అద్భుతం : పీసీ ఘోష్
  • కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ జడ్జి పీసీ ఘోష్

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : రామప్ప ఆలయ శిల్పకళ అద్భుతంగా ఉందని కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ జడ్జి పీసీ ఘోష్‌‌‌‌‌‌‌‌ అన్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పారు. రామప్ప టెంపుల్‌‌‌‌‌‌‌‌ను గురువారం పీసీ ఘోష్‌‌‌‌‌‌‌‌ దంపతులు సందర్శించారు. ముందుగా ఆలయ అర్చకులు, ఆఫీసర్లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈవో బిళ్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ శాలువాతో సన్మానించారు. అనంతరం గైడ్‌‌‌‌‌‌‌‌.. రామప్ప ఆలయ చరిత్ర, శిల్పకళ నైపుణ్యాలపై ఘోష్‌‌‌‌‌‌‌‌ దంపతులకు వివరించారు. తర్వాత వారు రామప్ప లేక్‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. వారి వెంట ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ సీఈ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఈఈలు జగదీశ్‌‌‌‌‌‌‌‌, నారాయణ, డీఈ రవీందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఏఈ జయంతి, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ గిరి బాబు, ఆర్‌‌‌‌‌‌‌‌ఐ విజేందర్‌‌‌‌‌‌‌‌, సీఐ సురేశ్‌‌‌‌‌‌‌‌, ఎస్సై సతీశ్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.