
హనుమకొండ, వెలుగు:హనుమకొండ జిల్లా కేంద్రంలోని అశోక జంక్షన్యూనియన్బ్యాంక్ఆవరణలో మంగళవారం ఉదయం డెడ్ బాడీ పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. చివరకు పోలీసులు మర్డర్గా తేల్చారు. హనుమకొండ సీఐ కరుణాకర్తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గొల్లపల్లి పెట్రోల్బంక్సమీపంలో ఉండే యంజాల శివ(26) కుటుంబానికి దూరమై ఒంటరిగా ఉంటున్నాడు. కూలి పనులతోపాటు రోడ్లపై చెత్త, ఇనుప సామాను ఏరుకొంటూ జీవిస్తున్నాడు.
ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ తండాకు చెందిన రమేశ్పరిచయం అయ్యాడు. కొన్ని రోజులుగా ఇద్దరూ కలిసి రోడ్లపై చెత్త ఏరుకుంటున్నారు. సోమవారం అర్ధరాత్రి డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి తర్వాత యూనియన్బ్యాంక్ఆవరణలో రమేశ్కర్రతో శివ తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలై శివ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం ఉదయం డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా, హత్య అని తేలింది. కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ వివరించారు.