హైదరాబాద్, వెలుగు: ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ రామ్కీ ఇన్ఫ్రా, బయో మైనింగ్ ద్వారా చెన్నైలోని కొడుంగయ్యూర్ డంపింగ్ గ్రౌండ్ను పునరుద్ధరించనుంది.
చెన్నైలోని కొడుంగయ్యూర్ డంపింగ్ గ్రౌండ్ను బయోమైనింగ్ ద్వారా పునరుద్ధరించడం కోసం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నుంచి రూ. 39.88 కోట్లు, రూ. 176.77 కోట్ల విలువైన రెండు కాంట్రాక్టులు దక్కించుకుంది. 2.4 ఏళ్లలో ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సి ఉంటుందని రామ్కీ తెలిపింది.