రంజాన్ కు భారీ బందోబస్తు : అంజనీ కుమార్

రంజాన్ కు భారీ బందోబస్తు : అంజనీ కుమార్

హైదరాబాద్ : మరికొద్ది రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఓల్డ్ సిటీ మక్కా మస్జీద్ ను సందర్శించారు సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్. ఓల్డ్ సిటీలో బందోబస్తు ఎక్కడ ఎలా ఉంచాలనేదానిపై పరిసరాలను పరిశీలించారు. 40 రోజుల పాటు ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు చేయాలని పోలీసులకు సూచించారు అంజనీ కుమార్. కమిషనర్ తో జాయింట్ సీపీ చవాన్ ,తరుణ్ జోషి అదీశ్నల్ జాయింట్ సీపీ ఎస్బి, డీసీపీ సౌత్ జోన్ ఉన్నారు.