- ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆర్అండ్ బీ శాఖ పరిధిలో రూ.లక్ష కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మేనేజింగ్ కమిటీ, జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో మంత్రి మాట్లాడారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని, రోడ్లు, భవనాల నిర్మాణంలో నాణ్యతకు టాప్ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని బిల్డర్స్కు పిలుపునిచ్చారు. కనెక్టివిటీ బాగుంటేనే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయన్నారు. అందుకే ప్రభుత్వం సుమారు రూ.లక్ష కోట్ల విలువైన పనులను చేపట్టిందని మంత్రి తెలిపారు.
