
ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు లేదా ఏదైనా పనిమీద రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు వెళ్లి రావాలంటే ట్రాన్స్పోర్టుకు రూ. వెయ్యి దాకా ఖర్చవుతోందని జిల్లా వాసులు వాపోతున్నారు. ఏడాదిన్నర కిందటి వరకు రంగారెడ్డి కలెక్టరేట్ను గతేడాది ఆగస్టు 25న ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పేరుతో కొత్తగా నిర్మించిన బిల్డింగ్కు షిఫ్ట్చేశారు.
ఇది ఓఆర్ఆర్ రావిర్యాల ఎగ్జిట్కు 3.2 కి.మీ, బొంగళూర్ గేట్– నాగార్జునసాగర్ రోడ్ నుంచి11.4 కి.మీ, శ్రీశైలం హైవే – తుక్కుగూడ నుంచి 9.2 కి.మీ దూరంలో ఉంది. కలెక్టరేట్కు ఎటు నుంచి రావాలన్నా సొంత వెహికల్ లేదా కిరాయి వెహికల్ఉండాల్సిందే. కలెక్టరేట్ కేంద్రంగా మొత్తం 33 డిపార్ట్మెంట్లలో దాదాపు 500 మంది అధికారులు పనిచేస్తుండగా, వారి కోసం జూబ్లీ బస్ట్స్టేషన్, దిల్సుఖ్నగర్, మియాపూర్, లింగంపల్లి, మెహిదీపట్నం, చార్మినార్ నుంచి మొత్తం 7 ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నారు.
కలెక్టరేట్కు వచ్చే జనం ఆ బస్సులు ఎక్కాలంటే ఉదయం 10.30 గంటల లోపు సదరు రూట్లలో వెయిట్ చేయాలి. తిరిగి వెళ్లాలంటే సాయంత్రం 5 గంటల వరకు వేచి ఉండాలి. ఈ మధ్యలో ఎలాంటి బస్సులు ఉండవు. క్యాబ్, ఆటోలో వెళ్లి రావాలంటే 500 నుంచి రూ. వెయ్యి ఖర్చవుతోంది. చుట్టుపక్కల గ్రామాలను కలుపుతూ బస్ సర్వీసులను పెంచాలని, గంట గంటకూ బస్సులు నడపాలని జనం రిక్వెస్ట్ చేస్తున్నా స్పందన లేదు.