తాజా టిఫిన్స్ లో సాంబారులో ఈగలు.. మున్సిపల్ అధికారులు తనిఖీ

తాజా టిఫిన్స్ లో సాంబారులో  ఈగలు.. మున్సిపల్ అధికారులు తనిఖీ

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఇమాంగూడలోని తాజా టిఫిన్స్​లో టిఫిన్​లో ఈగలు వచ్చాయి. సోమవారం ఓ కస్టమర్​ టిఫిన్​ ఆర్డర్​ చేయగా సాంబార్​లో ఈగ కనిపించింది. అంతేగాకుండా మరొకరికి ఇచ్చిన స్వీట్ లోనూ ఈగ దర్శనమివ్వడంతో నిర్వాహకులను నిలదీశారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో మున్సిపల్​ కమిషనర్​ వాణి అక్కడికి చేరుకుని కిచెన్, ఆహార పదార్థాలను పరిశీలించారు. తాజా హోటల్  నిర్వాహకులకు రూ.10 వేల జరిమానా విధించారు. పక్కనే ఉన్న పిస్తా హౌస్ లోనూ తనిఖీలు నిర్వహించి నీట్​నెస్​ లేకపోవడం, ప్లాస్టిక్​ కవర్లు వాడుతున్నందున రూ.10 వేలు ఫైన్​ వేశారు.