బాలీవుడ్ లో ఎంతో మందిని ఫిదా చేసిన హీరోయిన్స్ లో ఒకరు బ్యూటీ రాణీముఖర్జీ(Rani Mukerji). 1990 నుంచి కెరీర్ ను స్టార్ట్ చేసి, నేటికీ పలు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది.ఇప్పటికీ కుర్రకారు తన అందానికి ఫ్యాన్స్ గా ఉన్నారు. లేటెస్ట్ గా రాణీముఖర్జీ తన లైఫ్ లో జరిగిన ఓ చేదు సంఘటనను షేర్ చేసుకుంది.
14 వ మెల్ బోర్న్ ఇండియన్ ఫిల్మ్ పెస్టివల్(14th Indian Film Festival of Melbourne) స్టేజి పైన భావోద్వేగ సంఘటనను షేర్ చేసుకుంది. కరోనా టైంలో ప్రెగ్నెంట్ గా ఉన్న రాణీముఖర్జీ తన 5వ నెలకే కడుపులో ఉన్న బిడ్డని పోగొట్టుకున్నట్లు తెలిపింది.కాగా 2020 లో రెండవసారి ప్ప్రెగ్నెంట్ అని చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను. మరికొన్ని నెలల్లో పండంటి బిడ్డ పుడుతుందని ఎంతో ఆశతో ఉన్న నాకు..కరోనా నా లైఫ్ ని చీకటి చేసింది.
ఐదు నెలలకే కడుపులో బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ అర్దం కాలేదు. నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకున్నా, ఫస్ట్ ప్రెగ్నెన్సీ లో ఎలాంటి ప్రాబ్లెమ్ రాకున్నా, ఇలా కడుపులోనే బిడ్డ చనిపోవడం చాలా బాదేసేంది.
నా ఫ్యామిలీకు,నాకు తప్ప ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఫస్ట్ టైం ఈ స్టేజి పైనే షేర్ చేసుకున్నాను..అంటూ బాధతో రాణీముఖర్జీ మాట్లాడింది. ఇప్పుడు తన ఎమోషన్ ఫీలింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.