50 వేల మంది స్టూడెంట్స్ తో మాట్లాడునున్న.. రణవీర్,అలియా

50 వేల మంది స్టూడెంట్స్ తో మాట్లాడునున్న.. రణవీర్,అలియా

రణ్ వీర్ సింగ్ (Ranveer Singh), అలియా భట్(Alia Bhatt) కాంబో లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని (Rocky Aur Rani Kii Prem Kahaani).  ఈ మూవీను కరణ్ జోహార్( Karan Johar)  డైరెక్ట్ చేస్తున్నారు. జూలై 28న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రణవీర్,అలియా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. 

మల్టీ-సిటీ టూర్‌కు బయలుదేరనున్న ఈ జంట డైరెక్టర్ కరణ్ జోహార్‌తో కలిసి జూలై 21న భారతదేశంలోని 100+ నగరాల్లోని 50,000+ మంది స్టూడెంట్స్ తో ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యూనైట్ నేషన్స్ (IIMUN) తన 'బ్యాక్ టు స్కూల్' సిరీస్‌ను అట్టహాసంగా ప్రారంభిస్తోంది. ఈ ప్రయత్నానికి మద్దతుగా వీరు నిలవడంతో పాటు..ఈవెంట్స్ లో పాల్గొంటూ.. స్టూడెంట్స్ కు డైరెక్ట్ గా కనెక్ట్ అవుతూ మాట్లాడునున్నారు. దీంతో వీరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

ఇక ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరణ్ జోహార్ మళ్లీ డైరెక్షన్ చేస్తున్నారు. ఇక రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని మూవీ చూసాక ..థియేటర్ల నుండి బయటకు వెళ్ళేటపుడు మీ అందరి ముఖంలో చిరునవ్వు ఉంటుంది అని రణవీర్ సింగ్ తెలిపారు. ఈ మూవీలో రాఖీ అనే పంజాబీ కుర్రాడిలా రణ్ వీర్..రాణి అనే బెంగాళి అమ్మాయిగా  అలియా కనిపించబోతున్నారు.

భారీ తారాగణంతో వస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో ధర్మేంద్ర (Dharmendra), జయా బచ్చన్ (Jaya Bachchan)​ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్ ​(Dharma Production) బ్యానర్​లో కరణ్ జోహార్ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్నారు.

https://twitter.com/iimunofficial/status/1681703568523526144?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Etweet