గృహ ప్రవేశం చేసిన దీపికా, రణవీర్ జంట

గృహ ప్రవేశం చేసిన దీపికా, రణవీర్ జంట

కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె , రణవీర్ సింగ్ అలీబాగ్‌లో కొత్త ప్లాష్ ప్రాపర్టీని కొనుగోలు చేశారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వారు గృహ ప్రవేశం చేశారు. అందులో భాగంగా పూజలో పాల్గొన్న కొన్న ఫొటోలను రణ్ వీర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. బీ టౌన్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానే కోట్లలో అభిమానులను కూడగట్టుకున్న ఈ జంట ఇప్పటికే ది బెస్ట్ కపుల్ జాబితాలో చేరిపోయారు. కాగా రీసెంట్ గా ముంబైకి దగ్గర్లోని బీచ్ టౌన్ అలీబాగ్‌లో నిర్మించిన ఖరీదైన వెకేషన్ హోమ్‌లో వారు గృహ ప్రవేశ పూజను నిర్వహించారు. పర్సనల్ లైఫ్ ను ఎంతో ప్రైవేట్ గా ఉంచే ఈ జోడీ ... అదే తరహాలో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరుపుకున్నట్టు తెలుస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే, రణ్ వీర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పూజా హెగ్డేతో కలిసి రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కస్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రం 2022 క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. అలియా భట్, ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్‌లతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ కూడా లైన్లో ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2023న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు దీపికా .. షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహంతో కలిసి పఠాన్‌లో కనిపించనుంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 25, 2023న విడుదల కానుంది. ఆమె కిట్టిలో హృతిక్ రోషన్‌తో ఫైటర్ లో కనిపించనున్న విషయం తెలిసిందే.