బాలికపై అత్యాచారం: నిందితుడికి యావజ్జీవ శిక్ష

బాలికపై అత్యాచారం: నిందితుడికి యావజ్జీవ శిక్ష

ఆంధ్ర ప్రదేశ్: ఓ బాలికను అత్యాచారం చేసిన వక్తికి యావజ్జీవ శిక్షతో పాటు రెండు లక్షల జరిమానా విధించింది కోర్టు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో జరిగింది. 2015లో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఓ బాలికను సాయికృష్ణ అనే యువకుడు అత్యాచారం చేశాడు. అప్పటి డీఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి రేప్ ఫోక్సా చట్టం కింద కేసును నమోదు చేసి.. పూర్తి ఆధారాలతో కోర్టుకు సమర్పించారు. ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి… సాయి కృష్ణకు యావజ్జీవ శిక్ష విధించారు. బాధితురాలు కడపజిల్లా రాయచోటికి చెందిన బాలికగా పోలీసులు చెప్పారు. అమ్మమ్మ ఇంటికి వెళ్లగా అక్కడ ఆ బాలికను అత్యాచారం చేశాడు. ఈ కేసులో సరైన ఆధారాలు సేకరించినందుకు  డీసీపీ తిరుమల రెడ్డిని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయను అభినందించారు చిత్తూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి.