ఒంటరి మహిళపై అత్యాచారం, హత్య

ఒంటరి మహిళపై అత్యాచారం, హత్య

మెదక్ జిల్లా: మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపేసిన సంఘటన మంగళవారం మెదక్ జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో ఓ మహిళ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. అయితే ఒంటరిగా ఉన్న మహిళపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి.. హత్య చేశారు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కి తరలించిన పోలీసులు.. రాందాస్ చౌరస్తాలో టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మహిళగా గుర్తించామన్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని.. అత్యాచారం చేసిన దుండగులను వెతికేపనిలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు.