హైదరాబాద్, వెలుగు: ప్రేమపేరుతో యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ ఆనంద్కిషోర్ వివరాల ప్రకారం… హైదరాబాద్లోని యాకుత్ పురా సెగ్మంట్ఈతేబార్చౌక్ బస్తీకి చెందిన యువతి(20)కి స్థానికంగా ఉండే సయ్యద్హాజీ మస్తాన్ తో పరిచయం ఏర్పడింది. తనను ప్రేమిస్తుండడంతో యువతి అతనితో చనువుగా ఉండేది. ఇదే అదనుగా ఆమెను మాట్లాడదామంటూ పిలిచి మత్తుమందు కలిపిన చాక్లెట్ ఇచ్చాడు.
స్పృహ కోల్పోయిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చిన ఆమెకు మాయమాటలు చెప్పి అక్కడినుంచి పంపించేశాడు. మస్తాన్కు డబ్బులు అవసరమైనపుడల్లా ఏకాంత సమయంలో తీసిన ఫొటోలను యువతికి చూపించి బ్లాక్మెయిల్ చేసేవాడు. తాను విదేశాలకు వెళుతున్నానని, డబ్బులు కావాలనడంతో బంగారు నగలు తెచ్చి ఇచ్చింది. ఇంకా కావాలని వేధించడంతో భరించలేక విషయాన్ని కుటుంబీకులకు తెలియజేసింది. శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.