Cricket World Cup 2023: వరల్డ్ కప్ గెలిచేది ఎవరు..? : ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ జోస్యం

Cricket World Cup 2023: వరల్డ్ కప్ గెలిచేది ఎవరు..? : ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ జోస్యం

వరల్డ్ కప్ గెలిచే జట్టు ఏది.. ఎవరు క్రికెట్ విజేత కాబోతున్నారు.. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది.. ఇండియా, ఆస్ల్రేలియా జట్టలో ఎవరు బలంగా ఉన్నారు.. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో.. ఏ జట్టుపై ఒత్తిడి ఉంటుంది.. ఇలాంటి విషయాలపై తన రివ్యూ ఇచ్చారు ఆఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్..

ఇండియా, ఆస్ట్రేలియా జట్టకు ఫిఫ్టీ.. ఫిఫ్టీ ఛాన్సులు ఉన్నాయని.. ఇండియాతోపాటు ఆస్ట్రేలియా జట్టుకు కూడా కప్ గెలిచే సమర్థత ఉందన్నారు రషీద్ ఖాన్. రెండు జట్లు బలంగా ఉన్నాయని.. ఏ జట్టును తేలిగ్గా తీసుకోవటానికి వీల్లేదన్నారు రషీద్.

వరల్డ్ కప్ మ్యాచుల్లో ఓటమి ఎరుగని జట్టుగా ఇండియా మంచి ఫాంలో ఉందని.. అదే విధంగా ఆస్ట్రేలియా సైతం.. గత ఎనిమిది మ్యాచ్ లు వరసగా గెలుస్తూ వస్తుందని.. సౌతాఫ్రికాను ఒత్తిడిలో ఓడించిన విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ తన స్థాయిలో రివ్యూ ఇచ్చారు రషీద్ ఖాన్.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అని.. లక్ష మంది ప్రేక్షకుల మధ్య మ్యాచ్ ఆడటం అంటే ఒత్తిడి ఉంటుందని.. ఇండియా వంద శాతం సపోర్ట్ లభిస్తుందని.. ఇదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి వచ్చే ఒత్తిడిని ఆస్ట్రేలియా  ఫేస్ చేయాల్సి ఉంటుందన్నారు రషీద్ ఖాన్..

ఏదిఏమైనా ఆస్ట్రేలియా జట్టును తేలిగ్గా తీసుకోలేం అని.. అలా అని ఇండియా కొనసాగిస్తున్న ఫాంను పరిగణలోకి తీసుకుంటే.. రెండు జట్లకు ఫిఫ్టీ.. ఫిఫ్టీ ఛాన్సులు ఉన్నాయని జోస్యం చెప్పాడు ఈ ఆఫ్గనిస్తాన్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్..