ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకల్లో తళుక్కున మెరిసింది రష్మిక మందన. తమన్నాతో కలిసి డ్యాన్స్ చేసి అభిమానులను అలరించింది. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ లోనూ పెర్ఫార్మ్ చేసే చాన్స్ కొట్టేసింది. సామీ నా సామీ అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో ఆకట్టుకుంది. నాటు నాటు పాటకు కూడా కాలు కదిపింది.
ఈ ఈవెంట్ అనంతరం తాజాగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఐపీఎల్ ఫీవర్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ధోనీతో తీసుకున్న ఓ ఫొటోను సైతం పోస్ట్ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. ఒకప్పుడు బాలీవుడ్ పాటలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన ఐపీఎల్ ఈవెంట్లో తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ రష్మిక హుషారెత్తించడం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.