‘ఐపీఎల్​ ఫీవర్​ నుంచి బయటకు రాలేకపోతున్నా

‘ఐపీఎల్​ ఫీవర్​ నుంచి బయటకు రాలేకపోతున్నా

ఐపీఎల్​ 2023 ప్రారంభ వేడుకల్లో తళుక్కున మెరిసింది రష్మిక మందన. తమన్నాతో  కలిసి డ్యాన్స్​ చేసి అభిమానులను అలరించింది. పుష్ప సినిమాతో నేషనల్​ క్రష్​గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్​ లోనూ పెర్ఫార్మ్​ చేసే చాన్స్​ కొట్టేసింది. సామీ నా సామీ అంటూ క్యూట్​ ఎక్స్​ప్రెషన్స్​తో ఆకట్టుకుంది. నాటు నాటు పాటకు కూడా కాలు కదిపింది. 

ఈ ఈవెంట్​ అనంతరం తాజాగా కొన్ని ఫొటోలను సోషల్​ మీడియాలో షేర్​ చేసింది. ‘ఐపీఎల్​ ఫీవర్​ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను’ అంటూ క్యాప్షన్​ ఇచ్చింది. ధోనీతో తీసుకున్న ఓ ఫొటోను సైతం పోస్ట్​ చేస్తూ సంతోషం వ్యక్తం చేసింది. ఒకప్పుడు బాలీవుడ్​ పాటలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన ఐపీఎల్​ ఈవెంట్​లో తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ రష్మిక హుషారెత్తించడం స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది.