తనకు భారత రత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న క్యాంపెయిన్ ను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు ప్రముఖ బిజినెస్ మెన్ టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు రతన్ టాటా. తనకు భారత రత్న ఇవ్వాలంటున్న కొందరి అభిప్రాయలను గౌరవిస్తా కానీ..దయచేసి క్యాంపెయిన్ ను ఆపాలన్నారు. భారత రత్న కంటే ముందు.. తాను భారతీయుడినని..దేశాభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని అన్నారు.
రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో #BharatRatnaForRatanTata క్యాంపెయిన్ నడుస్తోంది. దీనిపై ఇవాళ ట్విట్టర్లో స్పందించిన రతన్ టాటా భారత రత్న ఇవ్వాలన్న క్యాంపెయిన్ నిలిపివేయాలని కోరారు.
see more news
యూట్యూబ్ లైవ్లో ఛాలెంజ్.. 1.5 లీటర్ వోడ్కా తాగి చనిపోయిన వ్యక్తి
రవిశాస్త్రీకి 120 ఏళ్లా.? గూగుల్ ను ఆటాడుకుంటున్న నెటిజన్లు
While I appreciate the sentiments expressed by a section of the social media in terms of an award, I would humbly like to request that such campaigns be discontinued.
Instead, I consider myself fortunate to be an Indian and to try and contribute to India’s growth and prosperity pic.twitter.com/CzEimjJPp5
— Ratan N. Tata (@RNTata2000) February 6, 2021