
తిరుమల తిరుపతి లోరథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న వేడుకలు ప్రారంభం కానున్నాయి. పర్వదినం రోజున ఏడు వాహనాలపై మాడ వీధుల్లో శ్రీవారిని ఊరేగించనున్నారు. రథసప్తమి ఏర్పాట్లను TTD అధికారులు సమీక్షిస్తున్నారు. రథసప్తమి రోజున అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు చెప్పారు. అంతేకాదు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.