శివాజీ, ప్రశాంత్లను మిస్ అవుతున్నా.. రతిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

శివాజీ, ప్రశాంత్లను మిస్ అవుతున్నా.. రతిక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) బ్యాచ్ లలో శివాజీ(Shivaji), రతిక(Rathika), ప్రశాంత్(Pallavi Prashanth) ల బ్యాచ్ వేరు. షో మొదలైన మొదటి రోజు నుండే ఈ ముగ్గురు చాలా క్లోజ్ గా ఉన్నారు. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఆడియన్స్ కు తెగ నచ్చేశారు. కానీ ఎప్పడైతే రతిక.. ప్రశాంత్ అండ్ శివాజీకి నెగిటీవ్ గా మారిందో అప్పటినుండి ఆమె ఎలిమినేషన్ కు దగ్గరైంది. అనుకోకుండా నాలుగో వారం లో హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఎలిమినేషన్ తరువాత మొదటిసారి రతిక పేరు ప్రస్తావించాడు ప్రశాంత్. శివాజీతో రతికను మిస్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్. ఈ కాన్వర్సేషన్ ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది రతిక

రతిక గుర్తుకురావడంతో తనకు నిద్రపట్టట్లేదని, ఆమెపై చాలా కోపంగా ఉందని శివాజీతో చెప్తాడు ప్రశాంత్. ఏం చేస్తాం రా.. చిన్నిపిల్ల బయటకు వెళ్లిన తర్వాత కలుద్దాం బాధపడకు.. అంటూ శివాజీ ప్రశాంత్ ను ఓదారుస్తాడు. రతిక నన్ను నామినేషన్ చేసినా.. మన అమ్మాయి అని మాట్లాడిన కానీ.. తను నన్ను నమ్మలేదు,  బయటకు వెళ్లాక కూడా రతిక నన్ను కలవదని బాధపడ్డాడు ప్రశాంత్. దీంతో ఈ కాన్వర్సేషన్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. వారిద్దరినీ తాను కూడా మిస్ అవుతున్నట్లు పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం రతిక చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.