నటుడు సుహాస్ ‘కలర్ఫొటో’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ‘హిట్ 2’ లాంటి చిత్రాల్లో నెగిటివ్ రోల్స్తోనూ ఆకట్టుకున్నాడు. అయితే ఆయన హీరోగా ఇటీవల మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘రైటర్ పద్మభూషణ్’ టైటిల్తో తెరకెక్కిన ఈ చిత్రానికి షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడు. ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో స్ట్రగులింగ్ రైటర్గా సుహాస్ కనిపించాడు. చిన్న సినిమాగా రిలీజైన భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ రష్మికా మందన్న, మాస్ మహారాజా రవి తేజ, ఈ సినిమా చూసి స్పందించారు.
ఈ సినిమాలో సుహాస్ నటన అద్భుతంగా ఉందని రవితేజ కొనియాడారు..సినిమా చూసినంతసేపు ఎంజాయ్ చేశానన్నారు. క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉందన్న ఆయన అందరూ ఈ సినిమా చూడాలని కోరారు. మరోవైపు రష్మిక కూడా స్పందించింది. మూవీ బాగా నచ్చిందని.. అందమైన చిత్రాన్ని తీశారని చెప్పింది. ‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇంత భారీ విజయాన్ని సాధించినందుకు మీ అందరికీ అభినందనలు. అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అని రష్మిక తెలిపింది.