వెంకీ రీ రిలీజ్ డెట్ ఫిక్స్... కాకపోతే అప్పటివరకు ఆగాల్సిందే

వెంకీ  రీ రిలీజ్  డెట్ ఫిక్స్... కాకపోతే అప్పటివరకు ఆగాల్సిందే

మాస్ మాహారాజ్ రవితేజ, స్నేహ హీరోహీరోయిన్లుగా శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన తెరకెక్కిన  చిత్రం వెంకీ. 2004 మార్చి 26న రిలీజై సూపర్ హిట్టైన ఈ చిత్రాన్ని అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించారు.  ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్  చేస్తున్నారు. అపిషీయల్ గా సినిమా రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 

2023 డిసెంబర్ 30న శ్రీ మాతా క్రియేషన్స్  ఈ సినిమాను రీ రిలీజ్ చేయనుంది. ఈ మేరకు పోస్టర్ ను కూడా రిలీజ్  చేసింది.  దీంతో రవితేజ ఫ్యాన్స్ తో పాటుగా వెంకీ మూవీ లవర్స్ అందరూ ఈ సినిమాను మరోసారి థియేటర్లో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు.   

కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అందుకుంది.  ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ ఈ  సినిమాకు బాగా ప్లస్ అయిపోయింది.  ఈ ఒక్క ఎపిసోడ్ కు సపరెట్ ఫ్యాన్స్ ఉన్నారు.  సినిమాంతా ఒక్కెత్తు అయితే. ఈ ఎపిసోడ్ మరో ఎత్తని చెప్పాలి. ఈ ట్రైన్ ఎపిసోడ్ తోనే సినిమా మలుపు తిరిగి అసలు కథ మొదలవుతుంది.  సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన మీమ్సే ఎక్కువగా ఉంటాయి.  

ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, కోన వెంకట్, గోపీమోహన్  డైలాగ్స్, సాహితి లిరిక్స్  సినిమాకు అడిషినల్ గా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాను శ్రీను వైట్ల డిల్ చేసిన విధానం స్టార్ హీరోలకు కూడా నచ్చేసింది. చిరంజీవి లాంటి స్టార్ తనతో సినిమా చేయమని ఓపెన్ ఆఫర్ చేశారు.  మరి  రీరిలీజ్ లో వెంకీ మూవీ ఎలాంటి ఇంపాక్ట్ తెస్తుందో చూడాలి.