కెరీర్ స్టార్ట్ చేసి ముప్ఫయేళ్లు దాటినా సూపర్ స్పీడ్తో సినిమాలు చేస్తున్నారు రవితేజ. ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’తో పాటు ‘ఈగల్’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు రీసెంట్గా దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మరో సినిమాను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేశారట మేకర్స్.
అంటే షెడ్యూల్స్ వారీగా ఒకేసారి మూడు చిత్రాలను పూర్తి చేయనున్నారు రవితేజ. ఇలా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సెట్స్లో జాయిన్ అవడం తనకు కొత్తేమీ కాదు. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత గోపీచంద్ మలినేని, రవితేజ కాంబోలో తెరకెక్కుతోన్న నాలుగో చిత్రమిది. అలాగే ‘వీర సింహారెడ్డి’ విజయం తర్వాత గోపీచంద్ రూపొందిస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు.