టీమిండియా కంటే వరల్డ్ కప్ గెలిచే సత్తా ఆ జట్టుకే ఉంది: అశ్విన్

టీమిండియా కంటే వరల్డ్ కప్ గెలిచే సత్తా  ఆ జట్టుకే ఉంది: అశ్విన్

వరల్డ్ కప్ మెగా సమరం మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ జరగనుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ కప్ ఏ జట్టు గెలుస్తుందన్న అంశంపై చర్చలు మొదలయ్యాయి. అయితే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్  ఈ సారి వరల్డ్ కప్ గెలిచే జట్టేదో చెప్పేశాడు.  తన ఫెవరెట్ టీమ్ పేరును చెప్పి ఆశ్చర్యానికి గురిచేశాడు. 

అశ్విన్ జోస్యంతో షాక్..

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వరల్డ్ కప్ విజేతను ముందుగానే చెప్పేశాడు. ఈ సారి వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా విజేతగా నిలుస్తుందంటూ బాంబు పేల్చాడు. ప్రతీ ఒక్కరు టీమిండియా పేరును చెప్తుంటే..అశ్విన్ మాత్రం ఆసీస్ పేరును చెప్పడం అభిమానులను షాక్ కు గురి చేసింది.

కారణం ఉందట..

వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుస్తుందని చెప్పడానికి ఓ కారణం ఉందని అశ్విన్ చెప్తున్నాడు. వరల్డ్ కప్ గెలిచే సత్తా భారత్ కు ఉందన్న అశ్విన్..అందరిలా తాను కూడా టీమిండియా అంటే జట్టుపై మరింత ఒత్తిడి పెరుగుతుందని..అందుకే ఆస్ట్రేలియా తన ఫేవరెట్ టీమ్ అని పేర్కొన్నట్లు అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ లో పేర్కొన్నాడు. 

సన్నాహాలు ప్రారంభం..

అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. దేశంలోని 10 స్టేడియాలు ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. మాజీ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో అక్టోబరు 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టీమిండియా వన్డే ప్రపంచకప్ వేటను ప్రారంభించనుంది.