టీడీపీకి షాక్.. రాయపాటి రంగారావు రాజీనామా

టీడీపీకి షాక్..  రాయపాటి రంగారావు రాజీనామా

ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవల చంద్రాబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనమా చేశారు. ఇంతలోనే ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. జనవరి 12వ తేదీ శుక్రవారం గుంటూరు సీనియర్ నేత రాయపాటి రంగారావు టీడీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీలో ఇమడలేనని.. తాన రాజీనమానా లేఖను ఆమెదించాలని లేఖలో వెల్లడించారు. ఆయన కుటుంబ సభ్యులు.. ఆఫీసులో ఉన్న చంద్రబాబు ఫోటోను నేలకేసి పగలగొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలియడంతో రాయపాటి రంగారావు కుటుంబం.. చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైకిల్ దిగుతున్నట్లు తెలుస్తోంది.