హిమాలయ పర్వతం ఎక్కుతూ.. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఇంజినీర్ మృతి

హిమాలయ పర్వతం ఎక్కుతూ.. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఇంజినీర్ మృతి

హిమాలయ పర్వతారోహణలో అపశృతి చోటు చేసుకుంది. పర్వతారోహణ చేస్తుండగా.. అస్వస్థతకు గురై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన ఆర్కిటెక్ట్ ఇంజినీర్ అడుసుమల్లి లక్ష్మణరావు (65) ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన కుటుంబంలో  విషాదం నెలకొంది. 

సాహస యాత్రలపై ఆసక్తి ఉన్న లక్ష్మణరావు.. పోరంకి, పెనమలూరు, విజయవాడకు చెందిన పలువురు పర్వతారోహన నిపుణులతో కలిసి.. వారం కింద హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలికి వెళ్లారు. అక్కడి నుంచి హిమాలయ పర్వతం ఎక్కటం ప్రారంభించారు. పర్వతం ఎక్కుతున్న సమయంలో.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు లక్ష్మణరావు. అక్కడున్న గైడ్స్.. వెంటనే ఆయనను చికిత్స కోసం కిందికి తీసుకొస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు. వాతావరణం మారిపోవటం, వాతావరణం అనుకూలించకపోవడంతోనే.. లక్ష్మణరావు చనిపోయారని.. అతనితోపాటు వెళ్లిన బృందం సభ్యులు సమాచారం ఇచ్చారు. 

లక్మణరావు మృతితో ఆయన స్నేహితులు, బంధువులు, స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లక్ష్మణరావు తన వృత్తిలోనూ ఎంతో అంకితభావంతో ఉండేవారని.. కృష్ణా జిల్లా ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎంతో కృషి చేశారంటూ మిత్రులు, బంధువులు, ఆప్తులు గుర్తు చేసుకుంటున్నారు.