కరోనా మరణాలపై చర్చకు సిద్ధమా

కరోనా మరణాలపై చర్చకు సిద్ధమా

కరోనా మరణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాస్తున్నాయని ఆరోపించారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన దొంగ లెక్కను కేంద్రం పార్లమెంట్‌లో తక్కువ చేసి చూపడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనాతో 1.80 లక్షల మంది చనిపోయారని తెలిపారు. కరోనా మరణాలపై ఆధారాలతో చర్చకు తాము సిద్ధమంటూ ప్రభుత్వానికి సవాల్ చేశారు దాసోజు. మంత్రి కేటీఆర్ తరపున ఎవరొస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.