దర్యాప్తులో సహకరించేందుకు సిద్ధం

దర్యాప్తులో సహకరించేందుకు సిద్ధం

తబ్లిగీ చీఫ్ మౌలానా సాద్
న్యూఢిల్లీ: పోలీసుల విచారణలో సాయపడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తబ్లిగీ జమాత్ చీఫ్​ మౌలానా సాద్ కాంధల్వి చెప్పాడు. ఇప్పటికే తాను పోలీసు దర్యాప్తులో జాయిన్ అయ్యానని.. దర్యాప్తునకు తానెప్పుడూ రెడీగా ఉంటానని స్పష్టం చేశాడు. మౌలానా సాద్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదవగా.. కొత్తగా 304 సెక్షన్ ను జత చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. దేశవ్యాప్తంగా తక్కువ సంఖ్యలో ఉన్న కరోనా వైరస్ కేసులు.. మర్కజ్ ఘటనతో దరిమిలా వేలాదిగా పెరుగుతున్న విషయం తెలిసిందే.