ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ సైలెన్స్కు కారణం?

ఆదిపురుష్ విషయంలో ప్రభాస్ సైలెన్స్కు కారణం?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) రాముడిగా చేసిన సినిమా ఆదిపురుష్(Adipurush). బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్(Om Raut) తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి సనన్(Kriti Sanon) సీతగా కనిపించింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మొదటి షో నుండే మిక్సెడ్ టాక్ వచ్చింది. అంతేకాదు.. సినిమాలోని సన్నివేశాలు, డైలాగ్స్ పై చాలా అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీ రాముని భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ స్పందించి.. సినిమాలో అభ్యంతరకమైన సంభాషణలను తొలగిస్తామని ప్రకటించింది. 

అయితే సినిమాపై ఇంత నెగిటివిటీ, ఆందోళనలు జరుగుతున్నా.. దీనిపై హీరో ప్రభాస్ స్పందించకపోవడం చర్చకు దారితీసింది. సినిమాకు ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్పా.. కనీసం ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు. ఆ ఈవెంట్ లో కూడా ప్రభాస్ చిన్న స్పీచ్ ఇచ్చి.. దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. అదే సినిమా గురించి ప్రభాస్ వేసిన లాస్ట్ పోస్ట్.

అయితే.. ప్రభాస్ సినిమాలు చేయడం తప్పా.. మిగతా విషయాల గురించి పెద్దగా పట్టించుకోడని, గతంలో సాహూ, రాధే శ్యామ్ విషయంలో కూడా ఇలాగే సైలెంట్ గా ఉన్నారని ఆయన సన్నిహితుల నుండి వినిపిస్తున్న మాట.