శేషాచలం అడవులు: ఎర్రచందనం స్మగ్లర్లపై ఫైరింగ్

శేషాచలం అడవులు: ఎర్రచందనం స్మగ్లర్లపై ఫైరింగ్

ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో మళ్లీ తుపాకుల మోత మోగింది. చంద్రగిరి సమీపంలోని భీమవరం దగ్గర రాత్రి టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ చేశారు. ఈ సమయంలో సిబ్బందికి 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురుపడ్డారు.  వారిని పట్టుకునేందుకు యత్నించారు  టాస్క్ ఫోర్స్ సిబ్బంది. దీంతో ఎదురు తిరిగిన స్మగ్లర్లు రాళ్లతో దాడికి దిగారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో కాల్పులు జరిపింది టాస్క్ ఫోర్స్. దీంతో ఎర్రచందనం దుంగలను అక్కడే పడేసి స్మగ్లర్లు పరారయ్యారు. వెంబడించిన టాస్కో ఫోర్స్ సిబ్బంది ఒక స్మగ్లర్ తో పాటు 15 ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. పరారయిన స్మగ్లర్ల కోసం గాలింపు కొనసాగుతుంది.