కడప జిల్లా: రూ . 40 లక్షల విలువైన 34 ఎర్రచంద‌నం దుంగలు సీజ్ : ఐదుగురు అరెస్ట్‌

కడప జిల్లా: రూ . 40 లక్షల  విలువైన  34 ఎర్రచంద‌నం  దుంగలు సీజ్ : ఐదుగురు అరెస్ట్‌

కడప జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఎర్ర చంద‌నం ఆప‌రేష‌న్‌ చేపట్టారు. ఏకంగా రూ.40 లక్షల విలువైన ఎర్రచందనం దుంగ‌లను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించారు

కడప జిల్లాలో ఎర్రచంద‌నం స్మగ్లర్లు పట్టుబడ్డారు. మొత్తం ఐదుగురు  స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుంచి భారీస్థాయిలో దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40 లక్షలుగా ఉంది. వీటితో పాటు రెండు మోట‌ర్ సైకిల్ ను సీజ్ చేశారు.

ముమ్మర తనిఖీలు…

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం…కడప జిల్లా పాలకొండలు రిజర్వ్​ ఫారెస్ట్​ ఏరియాలో  ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ బృందం ఆకస్మికంగా త‌నిఖీలు నిర్వహించింది. గురువారం( జూన్​ 13)  టాస్క్‌ఫోర్సు సిబ్బందికి వ‌చ్చిన స‌మాచారం మేర‌కు టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డీఎస్పీ జె. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఐ కృపానందకు చెందిన ఆర్ఎస్ఐ కె. అల్లిబాషా టీమ్  అన్నా సముద్రం ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. 

శుక్రవారం ( జూన్​ 13) ఉదయం  మామిళ్లపల్లి బీట్ పరిధిలోని పాలకొండలు అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు కనిపించారు. పోలీసులను చూడటంతోనే  వారు పారిపోడానికి ప్రయత్నించారు. అది గమనించిన టాస్క్ ఫోర్సు పోలీసులు వారిని వెంబడించి ఐదుగురిని పట్టుకున్నారు.  వారి నుంచి  34 ఎర్రచందనం దుంగలు,  రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 

ప‌ట్టుబడిన  నిందితుల‌ను విచారించ‌గా వారు అన్నమయ్య  జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి…  తిరుపతి టాస్క్​ఫోర్స్​ పోలీస్​ స్టేషన్​ కు తరలించిన ఎస్పై రఫీ  కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పట్టుబడిన ఎర్రచందనం దుంగలు విలువ రూ. 40లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఆపరేషన్ లో డీఎస్పీలు శ్రీనివాసులు రెడ్డి, ఎండీ షరీఫ్  పాల్గొన్నారు.