దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. 24 గంటల్లో లక్షా 32వేల 364 మందికి వైరస్ సోకింది. 2వేల 713 మంది చనిపోయారు. ఒక్కరోజులో 2 లక్షల 7వేల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 2 కోట్ల 85 లక్షల 74వేల మందికి వైరస్ సోకింది. ఇందులో ఇప్పటికే 2 కోట్ల 69 లక్షల 97వేల మంది కోలుకున్నారు. 3 లక్షల 40వేల మంది చనిపోయారు. ప్రస్తుతం 16 లక్షల 35వేల యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 22 కోట్ల 41 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని కేంద్రం చెప్పింది.