ఏపీ బడ్జెట్ రెండు లక్షల కోట్లుంటే.. 5 లక్షల కోట్ల హామీ లు ఇస్తున్నారని చంద్రబాబు, జగన్ లపై జన సేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.జనసేన పార్టీని స్థాపించకుండా ఉంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజల్ని అడ్డంగా దోచుకునేవని, అధికారంలో ఉన్నవారు 60 శాతం, ప్రతిపక్షంలో ఉన్నవారు 40 శాతం అంటూ రాయలసీమలో మాదిరి వాటాలు వేసి పంచుకునేవారని ఆరోపించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని కల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ” జనసేనకు ఒక్క శాతం ఓట్లు మాత్రమే వస్తాయని కేసీఆర్ అంటున్నారు. అదే నిజమైతే జనసేన అనగానే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఉత్తరాంధ్ర లో భూములపై కొందరి కన్నుపడింది. ఎక్కడి నుంచో వచ్చి వేల ఎకరాలు కొంటున్నారు.పులివెం దుల నుం చి డబ్బు సంచులు తెచ్చి ఇక్కడ భూములు కొంటే మనకు ఉపాధి అవకాశాలు కూడారావు. పులివెందులకు వెళ్లి మనం ఒక్క ఎకరం భూమి కొనగలమా? మన భూముల్ని కొం టూ మనల్నే తొక్కేస్తుంటే ఊరుకుంటామా” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం ఇప్పట్లో జరగదని, మినీ రిజర్వాయర్ల ద్వారా సాగుకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. సభావేదిక వద్ద మంటలు పవన్ కల్యాణ్ పాల్గొన్న ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభావేదిక వద్ద షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో వేదిక నుంచి దిగి వాహనంపై ఎక్కి పవన్ ప్రసంగం కొనసాగించారు. రాష్ట్రం లో జరిగిన సభలకు ఎక్కడా ఇబ్బంది కలగలేదని, శ్రీకాకుళంలో మాత్రమే తన సభలకు అడ్డుపడుతున్నారని పవన్ ఆరోపించారు.
ఏపీ బడ్జెట్ ను మించి హామీలు: పవన్
- ఆంధ్రప్రదేశ్
- April 1, 2019
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు