మలక్​పేట అంగన్​వాడీలో రెజీనా కసాండ్రా

మలక్​పేట అంగన్​వాడీలో రెజీనా కసాండ్రా

మలక్ పేట వెలుగు : సినీ హీరోయిన్ ​రెజీనా కసాండ్రా మలక్​పేట డివిజన్ విజయనగర్ ​కాలనీలో మెరిశారు. రేస్ టు విన్ ఫౌండేషన్ దత్తత తీసుకొని రెనోవేట్​ చేసిన అంగన్​వాడీ కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. చిన్నారుల కోసం అంగన్​వాడీ కేంద్రాన్ని పాజిటివ్ లెర్నింగ్ స్పేస్​గా మార్చడం అభినందనీయమన్నారు.

 రేస్ టు విన్ ఫౌండేషన్ సేవలు ఎంతో మందికి స్ఫూర్తి అని చెప్పారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వై.గోపిరావు పాల్గొన్నారు.