రెగ్యూలర్‌ సర్వీసులను తగ్గించినం : టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

రెగ్యూలర్‌ సర్వీసులను తగ్గించినం : టీఎస్‌ఆర్టీసీ  ఎండీ వీసీ సజ్జనార్‌
  • కొంత అసౌకర్యం కలిగే చాన్స్ ఉంది
  • జనరల్​ప్యాసింజర్లు సహకరించాలి

హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా జనరల్​ప్యాసింజర్లకు రిక్వెస్ట్ చేశారు. ‘తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను టీఎస్​ఆర్టీసీ నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం,  కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నం.

 జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6 వేల బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నందున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించాం. దీంతో సాధారణ ప్రయాణీకులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనసుతో సహకరించాలి’ అని సజ్జనార్ సాధారాణ ప్రయాణికులకు​విజ్ఞప్తి చేశారు.