నోటిఫికేషన్లు వేయండి.. లేదంటే రాజీనామా చేయండి

నోటిఫికేషన్లు వేయండి.. లేదంటే రాజీనామా చేయండి
  • వైఎస్ షర్మిల డిమాండ్

హైదరాబాద్: నిరుద్యోగుల ఆత్మబలిదానాల మీద పదవులు అనుభవిస్తూ, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు కేసీఆర్ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాప అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఉద్యోగాలివ్వకుండా నిరుద్యోగులను చంపుతూ ఉద్యమకారుడినని చెప్పుకోవడానికి సిగ్గుపడాలన్నారు. ఇంకెంత మందిని బలితీసుకొంటే నోటిఫికేషన్లు ఇస్తారు దొరా? అని ఆమె ప్రశ్నించారు. ‘మీకు కనికరం లేదు, కనీసం చీమ పారినట్టు కూడా లేదు.. ఎందుకంటే చచ్చేది మీ బిడ్డలు కాదు కాబట్టి.. మీకు సీట్లు, ఓట్ల మీదున్న ఆరాటం యువత ప్రాణాలు మీద లేదు.. నిన్న మహేష్, ఈ రోజు లవణ్ కుమార్, శ్రీకృష్ణ.. ఇలా ఈ ఏడాది దాదాపు 20 మందికి పైగా నిరుద్యోగులను చంపిన హంతకుడు మీరు.. మరొక్క నిరుద్యోగి ప్రాణం పోకముందే నోటిఫికేషన్లు వేయండి. లేదంటే రాజీనామా చేయండి..’ అని వైఎస్ షర్మిల ట్వీట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.