
హైదరాబాద్ : తెలంగాణలో ఎంట్రెన్స్ ఎగ్జమ్స్ షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 5 నుంచి 9 వరకు ఎంసెట్.. ఆగస్టు 3న ఈసెట్, ఆగస్టు 11-14 వరకు పీఈ సెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు. జులై 1 నుంచి ప్రత్యక్ష తరగతులు జరిగే అవకాశం ఉంది. డైరెక్టుగా క్లాసులు నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. 8 నుంచి ఆపై తరగతులకు డైరెక్టుగా క్లాసులు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. 7వ తరగతి వరకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నారు.