- ఇందుకు ఎస్ఈఎస్తో జోడీ
న్యూఢిల్లీ: రిలయన్స్గ్రూపునకు చెందిన జియో ప్లాట్ఫారమ్ ఇక నుంచి శాటిలైట్ ద్వారా కూడా ఇంటర్నెట్ సేవలు అందించనుంది. ఇందుకోసం లగ్జెంబర్గ్కు చెందిన ఎస్ఈఎస్తో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసింది. దీనిలో జియోకు 51 శాతం, ఎస్ఈఎస్కు 49 శాతం వాటాలు ఉంటాయి. కొన్ని ఇంటర్నేషనల్ ఏరోనాటికల్, మారిటైమ్కస్టమర్లు మినహా దేశమంతటా శాటిలైట్ డేటా, కనెక్టివిటీ సర్వీసులను అందిస్తారు. ఇంటర్నెట్ స్పీడ్ 100 జీబీపీఎస్ వరకు ఉంటుందని ఈ కంపెనీలు ప్రకటించాయి. ఇందుకోసం మల్టీ ఆర్బిట్ స్పేస్ నెట్వర్క్లను వాడతారు. ఇవి మల్టీ గిగాబైట్స్ లింకులను డెలివరీ చేయగలుగుతాయి. వీటి ద్వారా ఎంటర్ప్రైజ్లు, మొబైల్ బ్యాక్హాల్, రిటైల్ కస్టమర్లకు, పొరుగు దేశాలకు నెట్ సేవలను అందించవచ్చు. ఎస్ఈఎస్తో ఒప్పందం వల్ల మల్టీగిగాబైట్ బ్రాడ్బ్యాండ్సేవలు అందించడం సాధ్యమవుతుందని, త్వరలో 5జీ నెట్ సేవలనూ అందుబాటులో తెస్తామని జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ చెప్పారు. ఇదిలా ఉంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో పనిచేసే లాక్స్క్రీన్ ప్లాట్ఫారమ్ ‘గ్లాన్స్’లో 200 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,511 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్టు జియో ప్రకటించింది. సిరీస్ డీ ఫండింగ్గా ఈ మొత్తాన్ని అందిస్తామని తెలిపింది. ఈ ట్రాన్సాక్షన్కు రెగ్యులేటరీ అప్రూవల్స్ రావాల్సి ఉంది. అమెరికా, బ్రెజిల్, మెక్సికో, రష్యా వంటి మార్కెట్లపై గ్లాన్స్ ఫోకస్ చేసిన నేపథ్యంలో జియో ఈ ప్రకటన చేసింది. లాక్స్క్రీన్పై అత్యధికంగా కంటెంట్ఇచ్చే కంపెనీగా ఎదగాలని టార్గెట్గా పెట్టుకున్నట్టు గ్లాన్స్ తెలిపింది. ఈ–కామర్స్ ఎకోసిస్టమ్ను కూడా డెవలప్ చేస్తామని తెలిపింది. జియో నుంచి అందే డబ్బును ఇతర మార్కెట్లకు వెళ్లేందుకు ఉపయోగిస్తామని తెలిపింది.