- నాలుగో క్వార్టర్లో రూ. 2,709 కోట్ల ప్రాఫిట్
న్యూఢిల్లీ: హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)కు మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో నికరలాభం 25 శాతం తగ్గి రూ. 2,709.31 కోట్లుగా నమోదయింది. - గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 3,608.32 కోట్లు వచ్చాయి. రిఫైనింగ్ మార్జిన్లు పడిపోవడంతో లాభం తక్కువగా వచ్చిందని తెలిపింది. ప్రతి రెండు షేర్లకు ఒక ఉచిత బోనస్ షేర్ను ప్రకటించింది. ఈ క్వార్టర్లో ప్రతి బ్యారెల్ ముడి చమురును ఇంధనంగా మార్చడం ద్వారా సంస్థ 6.95 డాలర్లు సంపాదించింది.
ఒక సంవత్సరం క్రితం బ్యారెల్ గ్రాస్ రిఫైనింగ్ మార్జిన్కు 14.01 డాలర్లు ఉండగా, మునుపటి క్వార్టర్లో బ్యారెల్ మార్జిన్కు 8.50 డాలర్లు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 2 చొప్పున తగ్గించినందున దాని నికర లాభం కూడా తక్కువగా ఉంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో మార్కెటింగ్ మార్జిన్లు తగ్గుముఖం పట్టాయి. 2023–-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి హెచ్పీసీఎల్ రికార్డు స్థాయిలో రూ. 16,014.61 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత సంవత్సరంలో రూ. 6,980.23 కోట్ల నష్టం వచ్చింది.