ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో సేవలను మరింతగా విస్తరించింది. కస్టమర్లకు మరింత చేరువగా 5జీ సేవలను ప్రారంభించింది. దీంతో మరిన్ని ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ రాజస్థాన్లో 5జీ సేవలు ఆవిష్కరించారు. శ్రీనాథ్ జీ దేవాలయంలో ఆకాశ్ అంబానీ 5జీ సర్వీసులు ప్రారంభించారు. రిలయన్స్ జియో చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశ్ అంబానీ చేసిన తొలి కీలక ప్రకటన ఇదే.
ఇవాళ ఉదయం ఆకాశ్ అంబానీ స్పెషల్ ఫ్లైట్లో ఉదయ్పూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి నాథ్ద్వారా వెళ్లారు. అక్కడ 5జీ సర్వీసులు ప్రారంభించారు. అంబానీ కుటుంబానికి శ్రీనాథ్ జీ ఆరాధ్య దైవం. శ్రీనాథ్జీపై అంబానీలకు అపారమైన నమ్మకం ఉంది. ఇంతకుముందు కూడా రిలయన్స్ జియో 4జీ సేవలను ఈ ఆలయం నుంచే ప్రారంభించారు. ఇప్పుడు 5జీ సేవలను కూడా అక్కడి నుంచే ప్రారంభించారు.
ఇదిలా ఉంటే.. దేశంలో అక్టోబర్ 1 నుంచే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దేశవ్యాప్తంగా ఈ సర్వీసులు అందుబాటులోకి రావాలంటే ఇంకా రెండు, మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం ఎంపిక చేసిన పట్ణణాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. జియో పలు ప్రాంతాల్లో 5జీ సేవలు అందిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసిలో ఉన్న జీయో కస్టమర్లకు ఇప్పటినుంచి 5జీ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.